ETV Bharat / bharat

బంగాల్​ బరిలో జేడీయూ.. భాజపాపై​ ప్రభావమెంత?

author img

By

Published : Dec 26, 2020, 6:21 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనతాదళ్​ యునైటెడ్​ (జేడీయూ)ను నిలిపేందుకు సన్నాహాలు ప్రారంభించారు ఆ పార్టీ అధినేత, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​. పోటీ చేసేందుకు ఇప్పటికే 75 స్థానాలను గుర్తించినట్లు ప్రకటించారు పార్టీ బంగాల్​ నేతలు. ఈ క్రమంలో బంగాల్​ ఎన్నికల్లో జేడీయూ ప్రభావం ఎంత? బిహార్​లో దాని మిత్రపక్షమైన భాజపాకు ఈ నిర్ణయం అనుకూలమా, ప్రతికూలమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులతో పాటు భాజపా, విపక్ష పార్టీల మాటేంటి? ​

Nitish kumar
బిహార్​ సీఎం నితీశ్​ కుమార్

బంగాల్​ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు బరిలో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే.. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే బంగాల్​ ఎన్నికల బరిలో జనతాదళ్​ యునైటెడ్​ (జేడీయూ)ను నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. 75 స్థానాల్లో పోటీపడే అభ్యర్థులనూ గుర్తించారు. అయితే.. బంగాల్​ ఎన్నికలపై జేడీయూ ప్రభావమెంత? దీని వల్ల ఏ పార్టీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏ పార్టీకి జేడీయూ వల్ల మేలు జరగనుంది?.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపటమే లక్ష్యంగా గురువారం ఆ రాష్ట్రంలోని పలువురు జేడీయూ కార్యకర్తలను కలిశారు నితీశ్​ కుమార్​. కానీ ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ వర్కింగ్​ కమిటీ సమావేశంలో పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

" జేడీయూ బంగాల్​ విభాగం ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటోంది. పోటీ చేసేందుకు 75 సీట్లను ఇప్పటికే గుర్తించాం. జాతీయ వర్కింగ్​ కమిటీ సమావేశం జరగనుంది. జాతీయ అధ్యక్షుడి ముందు బంగాల్​ వంటి ఇతర రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. "

- బలియావి, జేడీయూ బంగాల్​ ఇంఛార్జి

ఓటు బ్యాంక్​ నిల్​..!

బంగాల్​లో జేడీయూకు ఓటు బ్యాంకు లేదు. పార్టీ ట్రాక్​ రికార్డును పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో నితీశ్​ పార్టీ దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. దిల్లీ, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, కర్ణాటక, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క ప్రాంతంలోనూ ఖాతా తెరవలేకపోయింది.

మరోవైపు.. పలువురు సీనియర్​ నేతలు బంగాల్​లో జేడీయూ పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. నితీశ్​ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు బంగాల్​ ఓటర్లను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. మద్య నిషేధం అమలును బంగాల్​ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని నితీశ్ చూస్తున్నారు​.

భాజపా మాటేంటి?

బంగాల్​ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసినప్పటికీ తమపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.. బిహార్​లో దాని మిత్రపక్షం భాజపా. ఈసారి పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు కాషాయ పార్టీ ప్రతినిధి వివేకానంద పాసవాన్​.

హాస్యాస్పదం..

బంగాల్​లో పోటీ చేయాలనే జేడీయూ నిర్ణయాన్ని హాస్యాస్పదంగా పేర్కొన్నారు రాజకీయ నిపుణుడు అజయ్​ ఝా.

"గతంలోనూ ఇతర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నితీశ్​. కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రతిపార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని కోరుకుంటుంది. నితీశ్​ కుడా అదే చేశారు. అయితే బంగాల్​లో జేడీయూ 75 స్థానాల్లో పోటీ చేయాలనుకోవటం నిజంగా హాస్యాస్పదం. ఆ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. బంగాల్​ ఎన్నికలకు వెళ్లడానికి బదులుగా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవటం మంచిది. జేడీయూతో ఏ ఒక్క పార్టీకి మేలు కానీ, హాని కానీ జరగదు "

- అజయ్​ ఝా, రాజకీయ విశ్లేషకుడు

మరోవైపు.. బంగాల్​లో భాజపా ఓట్లను చీల్చటం మినహా జేడీయూ వల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆర్జేడీ విమర్శలు..

బంగాల్​లో పోటీ చేయాలనే జేడీయూ నిర్ణయాన్ని తప్పుపట్టింది ఆర్జేడీ. భాజపాపై ఒత్తిడి తెచ్చేందుకేనన్న వార్తలను తిరస్కరించింది.

"భాజపాపై ఏవిధంగానూ ఒత్తిడి తెచ్చేందుకు జేడీయూ ధైర్యం చేయలేదు. కాషాయ పార్టీకే సాయం చేసేందుకు పోటీ చేస్తోంది. ఇదొక్కటే కాదు.. పలు విధాలుగా భాజపాకు భజనపరుడిగా నిరూపించుకోవాలనుకుంటోంది. "

- శ్యామ్​ రజాక్​, ఆర్జేడీ నేత, మాజీ మంత్రి.

ఇదీ చూడండి: బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

బంగాల్​ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు బరిలో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే.. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే బంగాల్​ ఎన్నికల బరిలో జనతాదళ్​ యునైటెడ్​ (జేడీయూ)ను నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. 75 స్థానాల్లో పోటీపడే అభ్యర్థులనూ గుర్తించారు. అయితే.. బంగాల్​ ఎన్నికలపై జేడీయూ ప్రభావమెంత? దీని వల్ల ఏ పార్టీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏ పార్టీకి జేడీయూ వల్ల మేలు జరగనుంది?.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపటమే లక్ష్యంగా గురువారం ఆ రాష్ట్రంలోని పలువురు జేడీయూ కార్యకర్తలను కలిశారు నితీశ్​ కుమార్​. కానీ ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ వర్కింగ్​ కమిటీ సమావేశంలో పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

" జేడీయూ బంగాల్​ విభాగం ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటోంది. పోటీ చేసేందుకు 75 సీట్లను ఇప్పటికే గుర్తించాం. జాతీయ వర్కింగ్​ కమిటీ సమావేశం జరగనుంది. జాతీయ అధ్యక్షుడి ముందు బంగాల్​ వంటి ఇతర రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. "

- బలియావి, జేడీయూ బంగాల్​ ఇంఛార్జి

ఓటు బ్యాంక్​ నిల్​..!

బంగాల్​లో జేడీయూకు ఓటు బ్యాంకు లేదు. పార్టీ ట్రాక్​ రికార్డును పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో నితీశ్​ పార్టీ దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. దిల్లీ, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, కర్ణాటక, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క ప్రాంతంలోనూ ఖాతా తెరవలేకపోయింది.

మరోవైపు.. పలువురు సీనియర్​ నేతలు బంగాల్​లో జేడీయూ పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. నితీశ్​ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు బంగాల్​ ఓటర్లను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. మద్య నిషేధం అమలును బంగాల్​ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని నితీశ్ చూస్తున్నారు​.

భాజపా మాటేంటి?

బంగాల్​ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసినప్పటికీ తమపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.. బిహార్​లో దాని మిత్రపక్షం భాజపా. ఈసారి పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు కాషాయ పార్టీ ప్రతినిధి వివేకానంద పాసవాన్​.

హాస్యాస్పదం..

బంగాల్​లో పోటీ చేయాలనే జేడీయూ నిర్ణయాన్ని హాస్యాస్పదంగా పేర్కొన్నారు రాజకీయ నిపుణుడు అజయ్​ ఝా.

"గతంలోనూ ఇతర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నితీశ్​. కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రతిపార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని కోరుకుంటుంది. నితీశ్​ కుడా అదే చేశారు. అయితే బంగాల్​లో జేడీయూ 75 స్థానాల్లో పోటీ చేయాలనుకోవటం నిజంగా హాస్యాస్పదం. ఆ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. బంగాల్​ ఎన్నికలకు వెళ్లడానికి బదులుగా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవటం మంచిది. జేడీయూతో ఏ ఒక్క పార్టీకి మేలు కానీ, హాని కానీ జరగదు "

- అజయ్​ ఝా, రాజకీయ విశ్లేషకుడు

మరోవైపు.. బంగాల్​లో భాజపా ఓట్లను చీల్చటం మినహా జేడీయూ వల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆర్జేడీ విమర్శలు..

బంగాల్​లో పోటీ చేయాలనే జేడీయూ నిర్ణయాన్ని తప్పుపట్టింది ఆర్జేడీ. భాజపాపై ఒత్తిడి తెచ్చేందుకేనన్న వార్తలను తిరస్కరించింది.

"భాజపాపై ఏవిధంగానూ ఒత్తిడి తెచ్చేందుకు జేడీయూ ధైర్యం చేయలేదు. కాషాయ పార్టీకే సాయం చేసేందుకు పోటీ చేస్తోంది. ఇదొక్కటే కాదు.. పలు విధాలుగా భాజపాకు భజనపరుడిగా నిరూపించుకోవాలనుకుంటోంది. "

- శ్యామ్​ రజాక్​, ఆర్జేడీ నేత, మాజీ మంత్రి.

ఇదీ చూడండి: బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.